పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.ఎనిమిది నెలల క్రితం ఆగిపోయిన వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ఇటీవలే పవన్ రాకతో పునః ప్రారంభం అయ్యింది.
సినిమా షూటింగ్ గతంలోనే సగంకు పైగా పూర్తి అయ్యింది.ఈనెలలో సినిమా షూటింగ్ను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ను ఎక్కువగా కోర్టులోనే చిత్రీకరించాల్సి ఉంది.ప్రస్తుతం కూడా కోర్టు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
అందుకు సంబంధించిన పవన్ లుక్ ఇప్పటికే బయటకు వచ్చింది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కోర్టు సన్నివేశాల తర్వాత శృతిహాసన్ కాంబోలో ఒక షెడ్యూల్ ఉంటుంది.
ఆ తర్వాత పాట చిత్రీకరణ కూడా ఉంటుందని అంటున్నారు.
వకీల్ సాబ్ సినిమా షూటింగ్ తర్వాత పవన్ క్రిష్ మూవీలో పాల్గొనాల్సి ఉంది.
అందుకే వకీల్ సాబ్ ను నవంబర్ చివరి వారంలోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు.డే అండ్ నైట్ షెడ్యూల్ను ప్లాన్ చేసిన యూనిట్ సభ్యులు అతి త్వరలోనే మరిన్ని సీన్స్ ను పూర్తి చేసి పవన్ నుండి సాధ్యం అయినంత వరకు తక్కువ డేట్లు తీసుకుని సినిమా పూర్తి చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడు.
ఎందుకంటే పవన్ డేట్లు చాలా కీలకం.ఆయన మరో నాలుగు అయిదు సినిమాలకు ఓకే చెప్పాడు.
అందుకే ఈ సినిమాను తక్కువ రోజుల్లో పూర్తి చేస్తే ఆయనతో పాటు అందరికి కూడా ఉపయోగదాయకం అంటున్నారు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా వకీల్ సాబ్ను తెరకెక్కిస్తున్నారు.
బాలీవుడ్ పింక్కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.అంజలి నివేదా థామస్లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
శృతిహాసన్ ఈ సినిమాలో పవన్ కుజోడీగా నటించబోతుంది.పవన్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదల అయ్యే అవకాశం ఉంది.