పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ కోసం ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు.వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా, కరోనా కారణంగా అది సాధ్యపడలేదు.
ఇక చివరిదశ షూటింగ్లో ఉన్న వకీల్ సాబ్ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకలు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.అయితే ఏదేమైనా ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ గట్టిగా భావిస్తున్నట్లు ఇటీవల టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
కానీ మళ్లీ ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం పవన్ రాజకీయ పరంగా ఫుల్ బిజీగా ఉండటంతో వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ను పూర్తి చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది.
అటు ఈ సినిమాలో పవన్కు జోడీగా అందాల భామ శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.ఆమెకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయడం కుదరకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.
దీంతో హడావుడిగా పండగ సీజన్కు రిలీజ్ చేసే బదలు ఈ సినిమాను ఉగాది కానుకగా రిలీజ్ చేస్తే బెటర్ అని వకీల్ సాబ్ యూనిట్ అనుకుంటోందట.దీంతో ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయడం లేదనే టాక్ ప్రస్తుతం ఫిలిం నగర్లో జోరుగా వినిపిస్తోంది.
ఈ వార్తతో పవన్ ఫ్యాన్స్ మరోసారి తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.ఇప్పటికే చాలా ఆలస్యం అవుతున్న వకీల్ సాబ్ చిత్రం, ఇప్పుడు మరో రెండు నెలలు వాయిదా పడుతుందా అని వారు ఆందోళన చెందుతున్నారు.
తమ అభిమాన హీరోను వెండితెరపై చూసి ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యింది.మరి తమ అభిమాన హీరో ఇంత గ్యాప్ తరువాత చేస్తున్న వకీల్ సాబ్ చిత్రాన్ని తాము ఎప్పుడు చూస్తామా అని వారు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తుండగా, నివేథా థామస్, అంజలి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోన్న సంగతి తెలిసిందే.