పవన్ రీ ఎంట్రీ మూవీ గురించి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.బాలీవుడ్ పింక్ రీమేక్గా తెరకెక్కిన వకీల్ సాబ్ తో దాదాపుగా మూడు సంవత్సరాల తర్వాత పవన్ వెండి తెరపై కనిపించబోతున్నాడు.
దాంతో వకీల్ సాబ్ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.షూటింగ్ 90 శాతంకు పైగా పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది.
లాక్డౌన్ ఎత్తివేసిన వెంటనే షూటింగ్స్ను ప్రారంభించి ఆ బ్యాలన్స్ను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
జూన్ నుండి షూటింగ్స్కు అనుమతి వచ్చింది.
కనుక జులై నెలలో వకీల్ సాబ్ చిత్రంను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు.ఇప్పటికే అందుకోసం ఏర్పాట్లు చేసుకోవాలంటూ నిర్మాత దిల్రాజుకు మరియు దర్శకుడికి పవన్ సూచించాడట.
అందుకు సంబంధించిన చర్చలు మళ్లీ మొదలు అయ్యాయి.ఇదే సమయంలో సినిమా విడుదల విషయంలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
థియేటర్లు ఆగస్టు లేదా సెప్టెంబర్లో పున: ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.థియేటర్లు ప్రారంభం సమయంకు వకీల్ సాబ్ పూర్తి అవ్వబోతుంది.కాని విడుదల విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉందంటున్నారు.
థియేటర్లు ప్రారంభం అయిన వెంటనే ప్రేక్షకులు రాకపోవచ్చు.
అందుకే వకీల్ సాబ్ చిత్రాన్ని కాస్త ఆలస్యంగా విడుదల చేస్తారనే చర్చ జరుగుతోంది.మరి ఏం జరుగబోతుంది అనేది దిల్ రాజు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
సాహసం చేసి విడుదల చేస్తానంటే ఆగస్టు సెప్టెంబర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.లేదంటే వచ్చే ఏడాది వరకు వకీల్ సాబ్ కోసం వెయిట్ చేయాల్సిందే.