పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత చేసిన పింక్ రీమేక్ వకీల్ సాబ్ మరో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా ఇంకా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టక పోవడంతో దిల్ రాజు పై ఇండస్ట్రీ వర్గాల నుండి మాత్రమే కాకుండా పవన్ అభిమానులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
బయ్యర్లు సైతం సినిమా పై ఇంకా ఎలాంటి బజ్ క్రియేట్ కాకపోవడంతో బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.దాంతో దిల్ రాజు సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు.
సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలా వారాలు అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్దం చేసిన మేకర్స్ ఎట్టకేలకు ప్రమోషన్ కోసం మీడియా ముందుకు వచ్చారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు వేణు శ్రీరామ్ మరియు నిర్మాతలు ఒక చిట్ చాట్ నిర్వహించారు.
ఆ చిట్ చాట్ లో సినిమా పై అంచనాలు పెంచే విధంగా పవన్ కళ్యాణ్ యొక్క గొప్పతనం మరియు లాక్ డౌన్ వల్ల వకీల్ సాబ్ ఎదుర్కొన్న సమస్యల ను గురించి చెప్పుకొచ్చారు.
విడుదల మరో వారం లేదా పది రోజులు ఉండగా మెగా స్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ లు ప్రత్యేక అతిథులుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.ఇలాంటి ఈవెంట్ లకు పవన్ హాజరు అవుతాడు.
కాని ప్రత్యేక ఇంటర్వ్యూలు లైవ్ చాట్ ల వంటి కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటాడు.వకీల్ సాబ్ కు భారీ పబ్లిసిటీ అవసరం.
కనుక ఈ సమయంలో అయినా ఆయన మీడియా ముందుకు వచ్చి సినిమా కోసం పబ్లిసిటీ చేస్తాడా అనేది చూడాలి.