పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ ప్రారంభం అయ్యి ఏడాది దాటింది.అప్పటి నుండి సినిమాకు సంబంధించిన పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.
ఎంతగా అంటే గతంలో ఏ పవన్ సినిమాకు రానన్ని పుకార్లు ఈ సినిమాకు వచ్చాయి.రికార్డు స్థాయిలో ఈ సినిమా బిజినెస్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.
దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. బోనీ కపూర్ ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉన్న విషయం తెల్సిందే.
మొదట్లో ఈ సినిమా ఔట్ పుట్ విషయంలో బోనీ కపూర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడని, పింక్ కథను పూర్తిగా మార్చి ఫీల్ పోయేలా చేస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారంటూ పుకార్లు షికార్లు చేశాయి.ఇప్పుడు ఆ పుకార్లు నిజం కాదని తేలిపోయింది.
వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పై బోనీ కపూర్ అస్సలు దృష్టి పెట్టడం లేదని పూర్తి బాధ్యతను దిల్ రాజుకు అప్పగించాడు అంటూ యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.
వకీల్ సాబ్ సినిమా షూటింగ్ విషయంలో ప్రస్తుతం కూడా అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగా సినిమా పై వరుసగా ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది.వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను వచ్చే నెలలో పూర్తి చేస్తామని దిల్ రాజు గతంలో చెప్పాడు.
ఇక జనవరి 1 న కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇప్పుడు సినిమా షూటింగ్ కోసం మళ్లీ విదేశాలకు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.
ఇవన్ని పుకార్లే అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.వకీల్ సాబ్ గురించి రోజుకు ఒక పుకారు చొప్పున మీడియాలో వస్తున్న నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక యూనిట్ సభ్యులు జుట్టు పీక్కుంటున్నారు.