దాదాపుగా మూడేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ సార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తుండగా తెలుగు అమ్మాయి అంజలి, యంగ్ హీరోయిన్ నివేద థామస్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
కాగా ఈ చిత్రానికి ఎంసీఏ చిత్ర దర్శకుడు “శ్రీరామ్ వేణు” దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు మరియు బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత బోనీ కపూర్ తదితరులు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తయి విడుదల కావాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ పనులు వాయిదా పడడంతో ఈ చిత్రం విడుదల మరింత ఆలస్యం అయింది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ అప్డేట్ గురించి చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియజేశారు.ఇందులో జనవరి 14వ తారీఖున సరిగ్గా 06:03 నిమిషాలకి వకీల్ సాబ్ చిత్ర టీజర్ ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాక ఈ విషయానికి సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు ఒక్కసారిగా సంబరాలు చేసుకుంటున్నారు.
అంతేగాక తమ అభిమాన నటుడు మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపిస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇక్కడ మరో విషయం ఏమిటంటే శృతి హాసన్ కూడా దాదాపుగా మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ తో నటిస్తోంది.
ఆ మధ్య పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కాటమ రాయుడు అనే చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు పవన్ కి జోడిగా నటిస్తోంది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇందులో భాగంగా ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న “విరూపాక్ష” అనే చిత్రంలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా ప్రారంభించారు. అయితే ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ కేవలం 25 రోజులు మాత్రమే కేటాయిస్తానని దర్శకుడితో చెప్పినట్లు కొందరు చర్చించుకుంటున్నారు.