పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన వకీల్ సాబ్ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ జోరు పెంచారు.ఇప్పటికే మగువ పాట వచ్చి సినిమా పై అంచనాలు భారీగా పెంచేసింది.
లేడీ ఓరియంటెడ్ సినిమా గా పింక్ ను హిందీలో చేశారు.పింక్ సినిమా ను తెలుగు లో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.
అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా కథలో చిన్న చిన్న మార్పులు చేసి కమర్షియల్ ఎలిమెంట్స్ ను జత చేయడం జరిగింది.ఈ సినిమా నుండి రెండవ పాట కు సంబంధించిన అప్ డేట్ అఫిషియల్ గా వచ్చేసింది.
సత్యమేవ జయతే అంటూ సాగే పాట ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు.
దిల్ రాజు ఈ సినిమా ను బోణీ కపూర్ తో కలిసి నిర్మిస్తున్నాడు.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.పవన్ కళ్యాణ్ కు జోడీగా ఈ సినిమా లో శృతి హాసన్ నటిస్తుంది.
ఆమె పాత్ర కొద్దిదే అయినా కూడా సినిమా కు కమర్షియల్ టచ్ ఇచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు.ఇక కోర్టు సీన్ లో అంజలి మరియు నివేథా థామస్ లు కనిపించబోతున్నారు.
వీరి నటన సినిమా కు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను ఏప్రిల్ 9నx విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.
విడుదల తేదీ ఖరారు చేసిన నేపథ్యంలో సినిమా ప్రచారం మొదలు పెట్టారు.మరో నెల రోజుల్లో సినిమా రిలీజ్ అంటూ అభిమానులు కౌంట్ డౌన్ మొదలు పెట్టారు.
ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని ఇచ్చాడు.మగువ సక్సెస్ అవ్వడంతో సత్యమేవ జయతే పాట ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.