సంక్రాంతి కానుకగా మూడు తెలుగు సినిమాలు ఒక డబ్బింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఈ నాలుగు సినిమాల ఓపెనింగ్స్ విషయం లో నిర్మాత లు సంతృప్తిగా ఉన్నారు.
కరోనా కారణంగా థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపేందుకు మాత్రమే ప్రభుత్వా లు అనుమతులు ఇచ్చాయి.మరో వైపు కరోనా భయంతో జనాలు థియేటర్ల ముందుకు వస్తారా అని కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.
సంక్రాంతికి వచ్చేందుకు చాలా సినిమా లు రెడీగా ఉన్నాయి.కాని జనాలు వచ్చేది లేనిది క్లారిటీ లేకపోవడంతో వాయిదా వేస్తూ వచ్చారు.
ఎట్టకేలకు కరోనా ఉన్నా కూడా ప్రేక్షకులు సినిమాను మర్చి పోలేదు ఖచ్చితంగా జనాలు థియేటర్లకు క్యూ కడుతూనే ఉంటారు అంటూ క్లారిటీ వచ్చేసింది.
కరోనా భయం తో వకీల్ సాబ్ సినిమాను సంక్రాంతి కి విడుదల చేయాల్సి ఉన్నా కూడా వాయిదా వేశారు.
సమ్మర్ లో సినిమాను విడుదల చేయాలనుకున్న దిల్ రాజు వస్తున్న రెస్పాన్స్ ను చూసి ముందే విడుదల చేస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచనకు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ముగిసింది.
డబ్బింగ్ ఇతరకత్ర పనులు కూడా వారం రెండు వారాల్లో పూర్తి అవుతాయి.కనుక ఎలాంటి ఆందోళన లేకుండా సినిమాను ఫిబ్రవరిలో విడుదలకు ఏర్పాట్లు చేయవచ్చు అంటున్నారు.
సాదారణంగా అయితే ఫిబ్రవరి మరియు మార్చి నెలలు పరీక్షల సీజన్.కాని ఈ సారి అలాంటిది ఏమీ లేదు.
పరీక్షలు ఎప్పుడు ఉండేది క్లారిటీ లేదు.కనుక పలు సినిమాలు ఫిబ్రవరి లో వచ్చేందుకు వెయిట్ చేస్తున్నాయి.
వాటి జాబితాలో పవన్ వకీల్ సాబ్ కూడా చేరే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.