వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భారీ జనాల మద్య చేసేందుకు దిల్ రాజు ప్రయత్నాలు చేశాడు.యూసుఫ్ గూడ పోలీస్ స్టేడియంలో వేలాది మంది హాజరు అవ్వడం వల్ల కరోనా ప్రమాదం ఎక్కువ ఉందనే ఉద్దేశ్యంతో వకీల్ సాబ్ కు అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించారు.
దాంతో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుక ఉన్నట్లా లేనట్లా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కోసం ఇంకా కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.
ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.ప్రీ రిలీజ్ వేడుక కోసం దిల్ రాజు వీలు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాడు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హైటెక్స్ లో ఈ వేడుకను అతి తక్కువ మంది సమక్షంలో నిర్వహించేందుకు పోలీసుల వద్ద దిల్ రాజు అనుమతుల కోసం రిక్వెస్ట్ చేశాడు.ప్రతి ఒక్కరు మాస్క్ ధరించేలా చూడటం తో పాటు సామాజిక దూరం పాటించే విధంగా వేదిక ఏర్పాటు చేస్తామని కూ డా దిల్ రాజు పోలీసులకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నాడు.
దాంతో ఖచ్చితంగా ఈసారి అనుమతులు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దిల్ రాజు సినిమా ను పెద్ద మొత్తానికి అమ్మేయడం జరిగింది.
సినిమా విడుదల సమయంలో హైప్ ఉంటేనే ఆ మొత్తాలు రావడంతో పాటు లాభాలు వస్తాయి.అందుకే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
భారీ అంచనాల నడుమ రూపొందిన వకీల్ సాబ్ సినిమా లో పవన్ కు జోడీగా శృతి హాసన్ నటించింది.ఇక కీలక పాత్రలో అంజలి, నివేదా థామస్ మరియు అనన్యలు నటించారు.
వీరు ముగ్గురి కోసం పవన్ లాయర్ గా కోర్టులో వాదిస్తాడు.