పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా మొదటి నాలుగు అయిదు రోజుల పాటు వసూళ్లను బాగా రాబట్టింది.కాని ఆ తర్వాత కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి.
థియేటర్లకు జనాలు వెళ్లవద్దంటూ కొందరు హెచ్చరించడంతో పాటు ప్రభుత్వాలు కూడా ఆందోళన కర రీతిలో కేసులు పెరుగుతున్న కారణంగా ఆంక్షలను కఠినతరం చేయడం జరిగింది.దాంతో జనాలు థియేటర్ల వైపుకు వెళ్లడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి.అయినా కూడా జనాలు మాత్రం వకీల్ సాబ్ సినిమా ను చూసేందుకు రెండవ వీకెండ్ కు క్యూ కట్టలేదు.
శని ఆదివారాల్లో సినిమా గొప్పగా వసూళ్లు సాదించలేదు.కేవలం అయిదు కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టినట్లుగా తెలుస్తోంది.
కరోనా టెన్షన్ లేకుంటే ఖచ్చితంగా 15 నుండి 20 కోట్ల వరకు శని ఆదివారాల్లో గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని, కాని ఇప్పుడు థియేటర్లలో వకీల్ సాబ్ ఆడటమే గగనంగా మారింది.జనాలు శని ఆదివారాల్లో కనిపించలేదు.
ఇక నేటి నుండి మరింతగా పల్చబడే అవకాశం ఉందంటున్నారు.వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ పింక్ కు రీమేక్ అనే విషయం తెల్సిందే.
సినిమా కు కమర్సియల్ హంగులు అద్ది విడుదల చేశారు.విడుదలైన మొదటి రోజే ఇదో మంచి సినిమా అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
వసూళ్లు కూడా దాదాపుగా వంద కోట్లను కేవలం నాలుగు అయిదు రోజుల్లోనే సాధించింది.ఈ సినిమా షేర్ విషయానికి వస్తే లాంగ్ రన్ లో 80 కోట్లు వచ్చినట్లుగా చెబుతున్నారు.
మొత్తంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిందా అంటే సాధించింది అనే సమాధానం వస్తుంది.పవన్ కళ్యాణ్ స్టామినా ముందు చిన్న లక్ష్యం ఉంచడం వల్ల కరోనా ఉన్నా కూడా ఛేదించడం జరిగింది.
వకీల్ సాబ్ ఈ వారంతో పూర్తిగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది.