పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్నాడు.
మరో వైపు మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ను చేస్తున్నాడు.రీమేక్ లో పవన్ రానా తో కలిసి నటిస్తున్న విషయం తెల్సిందే.
మొన్నటి వరకు రీమేక్ షూటింగ్ లో రానా తో కలిసి షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఇటీవలే క్రిష్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.పవన్ మరియు కీలక చిత్ర నటీ నటుల తో దాదాపుగా పది రోజుల పాటు చిత్రీకరణ జరిపారు.నేడు ఉదయం 7 గంటల నుండి దాదాపు మద్యాహ్నం 12 గంటల వరకు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మద్యాహ్నం 2 గంటల నుండి మలయాళం రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
1970 మరియు 80 లల్లో హీరోలు ఒకే సారి చాలా సినిమా లు చేసిన సమయంలో ఒకే రోజు రెండు మూడు సినిమా ల షూటింగ్ ల్లో పాల్గొనే వారు.కాని ఇప్పుడు ఏ ఒక్క హీరో కూడా ఒకే సారి రెండు మూడు సినిమా లు చేయడం లేదు.ఒక వేళ చేసినా కూడా సినిమా కు సినిమాకు షెడ్యూల్ గ్యాప్ చాలా ఉంటుంది.
ఈ జనరేషన్ హీరోల్లో కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే రెండు సినిమా ల షూటింగ్ లకు ఒకే రోజు హాజరు అయిన ఘనత దక్కింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఇదే పద్దతిన మూడు నాలుగు రోజుల పాటు షూటింగ్ లకు హాజరు అవ్వబోతున్నాడు.
క్రిష్ దర్శకత్వంలో సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పారు.ఇక అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ను మాత్రం ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
.