పవన్ కళ్యాణ్ ప్రెసెంట్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి అవ్వడంతో మిగతా పార్ట్ కూడా వేగంగా పూర్తి చేస్తున్నాడు.
పవన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో పవర్ స్టార్ అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా తర్వాత పవన్ లైనప్ లో హరీష్ శంకర్ ఉన్నాడు.
భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ కూడా అనౌన్స్ చేసారు.హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా సమ్మర్ లోనే సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి.
కానీ పవన్ వీరమల్లు పూర్తీ అయినా తర్వాతనే ఈ సినిమా స్టార్ట్ చేయనున్నాడు.దీంతో ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు.
ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే.అందుకే ఈ సినిమాపై పవర్ స్టార్ అభిమానులు భారీ హోప్స్ పెట్టుకున్నారు.
తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.ఇందులో ఈ సినిమా గురించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
ఈయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.
ఈ సినిమా ఆగష్టులో సెట్స్ మీదకు వెళుతుందని.ఇందులో 80 శాతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరగనుందని.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపిస్తారని చెప్పి ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చాడు.
అలాగే ఒక బాడ్ న్యూస్ కూడా చెప్పాడు.ఈ సినిమా పాన్ ఇండియా కాదని చెప్పడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తునాన్రు.
చిన్న హీరోలు సైతం పాన్ ఇండియా అంటుంటే పవన్ మాత్రం ఇంకా పాన్ ఇండియా చేయకపోవడంతో కొద్దిగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.