పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని పొందిన సంగతి తెలిసిందే.తెలుగు, హిందీ భాషలు కలుపుకొని దాదాపు వంద కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం, 50-55 కోట్ల షేర్ వద్ద బాక్సాఫీస్ పరుగుని ఆపే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ రకంగా , ఎటు చూసినా, 40 కోట్లకి పైగానే నష్టాలు వస్తున్నాయి పంపిణిదారులకి.
తమకి నష్టపరిహారం చెల్లించాల్సిందే అని ఇప్పటికే బయ్యర్లు ఫిలిం చాంబర్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే.
ఎలాంటి స్పందన రాకపోవడంతో బయ్యర్లంతా కలిసి పవన్ కళ్యాణ్ ని స్వయంగా కలిసి మాట్లాడదామనే ప్లాన్ కూడా వేసారు.కాని ఇంతలోనే పవన్ నుంచి డిస్ట్రిబ్యుటర్లకి కబురు అందినట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఉంటుందన్న సంగతి తెలిసిందే.సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మించిన శరత్ మరారే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తారు.
సర్దార్ తో వచ్చిన నష్టాల్ని ఎస్ జే సూర్య సినిమాతో తీర్చేస్తానని మాటిచ్చాడట పవన్.మరి పవన్ ఇచ్చిన ఈ ఆఫర్ బయ్యర్లకు నచ్చిందో లేదో, వారి స్పందన ఏంటో తెలియరాలేదు.