ఏపీ రాజకీయాలలో ఇప్పుడు తెలుగు దేశం కంటే అధికార పార్టీ వైసీపీకి, జగన్ కి బద్ధ శత్రువుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు.ముఖ్యమంత్రిగా జగన్ సర్కార్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వేలెత్తి చూపిస్తూ వారి వైఫల్యాలని ప్రశ్నిస్తూ వైసీపీ నేతలకి టార్గెట్ గా మారిపోయాడు పవన్ కళ్యాణ్.
వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ఎంత తిడితే అంతగా తమ అధినేత దగ్గర గుర్తింపు వస్తుందనే విధంగా ప్రవర్తిస్తున్నారు.అయితే ప్రస్తుతం తెలుగు రాష్టాలలో కరోనా నియంత్రణకి ముఖ్యమంత్రులు పూర్తిస్థాయిలో పని చేస్తున్నారు.
జగన్ సర్కార్ గ్రామ వాలంటీర్ వ్యవస్థని సమర్దవంతంగా వినియోగించుకొని కరోనా కేసులు పెరగకుండా నియంత్రించగలుగుతుంది.
ఈ నేపధ్యంలో జగన్ ప్రభుత్వం నిర్ణయాలపై జనసేనాని ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా విషయంలో తీసుకునే చర్యలకు జనసేన మద్దతు ఉంటుందని తెలిపారు.జగన్ సర్గార్కు ఇటువంటి విపత్కర పరిస్థితిలో జనసేన పూర్తిగా మద్దతు ఇస్తుందని చెప్పారు.
కరోనాపై ప్రభుత్వానికి సహకారం అందించాలని జనసైనికులకి సూచించలు చేశారు.దీంతో పాటు ఏపీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు.
మార్కెట్లు మూసివేయడంతో మామిడి రైతులు భారీ నష్టాలు వస్తాయని భయపడుతున్నారని అందువల్ల దానికి సంబంధించిన చర్యలు ప్రభుత్వం చేపట్టాలనీ కోరారు.ఇక మహిళలపై నెలకొన్న ఒత్తిడిని దూరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని లోన్ తిరిగి కట్టేందుకు జూన్ వరకూ అవకాశం ఇవ్వాలనీ కోరారు.
మొత్తానికి జగన్ సర్కార్ చేస్తున్న కరోనా నియంత్రణకి జనసేనాని మద్దతు ప్రకటించడంపై వైసీపీ కార్యకర్తలు, నేతలు స్వాగతిస్తున్నారు.