ఏపీలో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడంతో పాటు తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్న ఈ సమయంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంబ్రాబు నాయుడు రేపు దీక్ష చేసేందుకు సిద్దం అయ్యారు.ఈ సందర్బంగా తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి రేపు జరుగబోతున్న దీక్షకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరాడు.
ఇప్పటికే ఈ విషయమై కలిసి పోరాటం చేయాలనుకున్న ఈ రెండు పార్టీలు దీక్షలో కూడా కలిసి పాల్గొనబోతున్నాయి.
చంద్రబాబు నాయుడు దీక్షకు జగన్ నేరుగా హాజరు కాకున్నా తన పార్టీ తరపున పూర్తి మద్దతును ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు తెలియజేశారు.
చంద్రబాబు నాయుడు చేయబోతున్న దీక్షకు బీజేపీ మద్దతు కోరగా అందుకు నో చెప్పడం జరిగింది.బీజేపీ మద్దతు లేకున్నా కూడా ఇతర విపక్షాల మద్దతు కూడగట్టడంలో తెలుగు తమ్ముళ్లు సక్సెస్ అయ్యారు.
వరుసగా భారీ కార్యక్రమాలు చేస్తు ఇసుక కొరత సమస్యపై ఏపీ ప్రభుత్వంకు విపక్షాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.అయితే ప్రభుత్వం మాత్రం విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి, పబ్లిసిటీ కోసం ఇలాంటి కార్యక్రమాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.