జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు.కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఓ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించడంతో.
పవన్ డిల్లీ కి వెళ్లడం జరిగింది.ఆ కార్యక్రమంలో పాల్గొనటానికి ఈరోజు ఉదయమే పవన్ డిల్లీ వెళ్ళడం జరిగింది.
అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తో ప్రత్యేకంగా భేటీ అయిన పవన్ కళ్యాణ్ బీజేపీ కీలక నాయకులతో కూడా సమావేశమయ్యారు.
దీంతో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఏదైనా రాజకీయ అంతర్యం ఉందా.?? ఇంకా దేని గురించి అయినా బిజెపి నాయకులతో పవన్ ప్రత్యేకంగా మాట్లాడారా.?? అనేది తెలుగు రాజకీయాలలో సస్పెన్స్ గా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అదేరీతిలో మొన్న జగన్.
ఆయా పనుల కి సంబంధించి ఢిల్లీ వెళ్లారు.తాజాగా పవన్ వెళ్ళటంతో ఈ న్యూస్ తెలుగు రాజకీయాల్లో సెన్సేషనల్ గా మారింది.