ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేనాని పవన్ వ్యూహం మారుతోందా ? వచ్చేఎ న్నికల్లో 175 స్థానాల్లోనూ పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన ఇప్పుడు తనకు బలమైన నియోజకవర్గాలతోపాటు.టీడీపీని దెబ్బకొట్టగలిగేలా.
ఉండే నియోజకవర్గాలను ఎంచుకుంటున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది.వచ్చే ఎన్నికల్లో తాను స్వయంగా పోటీ చేసి తీరతానని పవన్ ఏడాదిన్నర కిందటే ప్రకటించాడు.
అంతేకాదు, తాను పోటీ చేసేది కూడా వెనుకబడ్డ జిల్లా అనంతపురం నుంచేనని చెప్పుకొచ్చాడు.దీనిని బట్టి అందరూ అనంతపురం ఎమ్మెల్యే సీటు నుంచి పవన్ రంగంలోకి దిగడం ఖాయమని అనుకున్నారు.
ఇక్కడ నిజానికి పవన్ ఫాలోయింగ్ ఎక్కువ.గత ఎన్నికల్లో టీడీపీ ఎంపీగా బరిలోకి దిగిన జేసీ దివాకర్రెడ్డి పనిగట్టుకుని పవన్ను హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అనంతపురం తీసుకు వెళ్లి ఒక రోజు మొత్తం ప్రచారం చేయించుకున్నాడు.ఫలితంగా అత్యధిక మెజారిటీతో జేసీ విజయం సాధించాడు.ఇలా పవన్కు అత్యంత బలమైన నియోజకవర్గం ఏదంటే అనంతుపురమనే చెప్పాలి.అయితే, పవన్ ఇప్పుడు వ్యూహం మార్చుకున్నాడు.వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలోనే ఆయన మరింత స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
ప్రధానంగా టీడీపీకి బలమైన స్థానాలున్న చోట తన హవా చాటాలని నిర్ణయించుకున్న ట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పవన్ వచ్చే ఎన్నికల్లో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.దీనిపై కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఇన్చార్జ్ ముత్తంశెట్టి కృష్ణారావు చెప్పిన వివరాల ప్రకారం అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేనను మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.
అయితే, ఇక్కడే ఎందుకు పోటీ చేయాల్సి వస్తోందన్న దానిపై క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం.అయితే, ఇక్కడ గత ఎన్నికల్లో మండలి బుద్ధ ప్రసాద్ పోటీ చేశారు.2014 విభజన వేడి నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి.వెంటనే ఆ జెండాపై పోటీ చేసి గెలుపొందారు.
అయితే, వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.ఆయన తప్ప ఎవరు అక్కడ టీడీపీ నుంచి పోటీ చేసినా ఫలితం ఉండదు.
మరి ఈ నేపథ్యంలోనే పవన్ ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడా? అని అనిపిస్తోంది.ఏదేమైనా పవన్ నిర్ణయంపై విస్మయం వ్యక్తమవుతోంది.