పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం ‘వకీల్ సాబ్’ గురించి మీడియాలో రోజుకో వార్త వస్తూనే ఉంది.షూటింగ్ దాదాపుగా పూర్తి అయిన ఈ చిత్రంలో చిన్న పాత్ర కోసం శృతి హాసన్ను తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి.
పవన్తో ఆమె షూటింగ్లో పాల్గొందని, మరో రెండు మూడు రోజుల పాటు ఆమె షూట్లో పాల్గొనాల్సి ఉందంటూ వార్తలు వచ్చాయి.వీరిద్దరి కాంబోలో గతంలో గబ్బర్సింగ్ ఇంకా కాటమరాయుడు చిత్రాలు వచ్చాయి.
గబ్బర్సింగ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది.కాటమరాయుడు యావరేజ్గా నిలిచింది.
మళ్లీ వకీల్ సాబ్ చిత్రంలో వీరిద్దరు కలిసి నటిస్తే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం అనుకున్నారు.అయితే సినిమా షూటింగ్లో తాను పాల్గొన్నట్లుగా వస్తున్న వార్తలపై శృతి హాసన్ క్లారిటీ ఇచ్చింది. వకీల్ సాబ్ చిత్రం కోసం అసలు తనను ఎవరు సంప్రదించలేదు.షూటింగ్లో ఎలా పాల్గొంటాను అంటూ ఆమె ప్రశ్నించింది.పవన్ సార్తో నటించడంను ఎంజాయ్ చేస్తాను. కాని ఆయన నుండి నాకు కొత్తగా ఎలాంటి ఆఫర్ రాలేదని ఆమె పేర్కొంది.
పవన్ వకీల్ సాబ్ చిత్రంలోనే కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించబోతున్న సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్ అంటూ వార్తలు వచ్చాయి.అయితే ఆ వార్తలపై మాత్రం శృతి స్పందించలేదు.
అయితే పవన్ నుండి ఎలాంటి పిలుపు అయితే రాలేదు అంటూ పేర్కొంది కనుక హరీష్ శంకర్ మూవీలో శృతి హాసన్ నటిస్తుందో లేదో అనే విషయంపై కూడా క్లారిటీ వచ్చింది.ఇప్పటి వరకు హరీష్ శంకర్ ఆమెను సంప్రదించలేదని క్లారిటీ వచ్చేసింది.