సినీ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి పేరు ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికీ తెలిసిందే.ఏదో ఒక విషయం తో హాట్ టాపిక్ గా మారే శ్రీ రెడ్డి గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో చేసిన రచ్చ నుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ బాగా రచ్చ చేస్తుంది.
సినీ ఇండస్ట్రీలో నటీనటులను తన నోటికి వచ్చిన మాటలతో బాగా విమర్శలు చేస్తూ ఉంటుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్క విషయాన్ని వైరల్ గా మారుస్తుంది.చాలా వరకు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పట్ల ఎక్కువ విమర్శలు చేస్తూ ఉంటుంది.
ఇక ఈ మధ్య రాజకీయ రంగాలకు చెందిన వారిని కూడా వదలట్లేదు.తను ఏదైనా పోస్ట్ చేస్తే చాలు అది క్షణాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్, శ్రీ రెడ్డి ల పెళ్లి ఫోటో బాగా వైరల్ గా మారింది.
ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలలో తల దూర్చి మరీ రెచ్చిపోయింది శ్రీరెడ్డి.గతంలో తన భార్యల గురించి.మరో నటి పూనమ్ కౌర్ ను లాగుతూ బాగా రచ్చ చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా పవన్, తను కలిసి ఉన్న పెళ్లి ఫోటో షేర్ చేసింది.పైగా అందులో పెళ్లి కి పెద్దగా రామ్ గోపాల్ వర్మ కనిపించగా బాగా వైరల్ గా మారింది.
ఇక ఈ ఫోటో ఎవరో ఎడిట్ చేయగా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.
పైగా సజ్జనార్ సార్ పేరు తీస్తూ మరింత హాట్ టాపిక్ గా మార్చింది.సార్ సార్ సజ్జనార్ సార్.ఇలాంటి ఎడిటింగ్ చేసిన వారిని కఠినంగా శిక్షించండి సార్.
ఇలాంటి ఫోటోలు బయటకు వస్తే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్ అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.ఇక ఈ పోస్టులు చూసిన నెటిజనులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.