ఇద్దరు ముఖ్యమంత్రులు పొలిటికల్ గేమ్స్ ఆపండి! జనసేనాని తీవ్ర హెచ్చరిక!

రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజలు సమస్యలతో సతమతమవుతూ వుంటే ముఖ్యమంత్రులు ఇద్దరు తమ పంతం నెగ్గించుకోవడం రాజకీయ క్రీడలు ఆడుకోవడం ఆపేసి రాష్ట్రాల ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్ధించాడు.నరసరావు పేట బహిరంగ సభలో మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ అధికార, ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

 Pawan Kalyan Serious Warning To Babu And Kcr-TeluguStop.com

అధికార పార్టీని ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేసి, అరెస్ట్ లు చేయిస్తుంది, ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచిస్తాం అంటుంది.ఇలాంటి పరిస్థితిలో ప్రజల బాద్యత పట్టుంచుకోరా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత డేటాని ప్రైవేట్ కంపెనీలకి అప్పగించి టీడీపీ రాజకీయ క్రీడా ఆడుతుంటే, దానిని అవకాశం వాడుకొని చంద్రబాబు మీద కేసీఆర్ పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.మీ ఇద్దరి గొడవల మధ్య యువత, ప్రజలు నలిగిపోతున్నారు.

ఇక ప్రజల తరుపున వుండాలని వచ్చిన నా మీద పొలిటికల్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు.ఇప్పటికైనా వాటిని ఆపేయండి.

జనసేన పార్టీని తాను స్టార్ట్ చేసింది రేపటి తరం భవిష్యత్తు కోసమే తప్ప అధికార వ్యామోహంతో కాదు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.ఇక ఈ బహిరంగ సభలో పవన్ మరో వైపు అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube