జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి “జనవాణి” కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను పవన్ తీసుకోవడం జరిగింది.
అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.ఫీజు రియంబర్స్ మెంట్ కి సంబంధించి విద్యార్థుల నుండి ఎక్కువ అర్జీలు వచ్చాయని తెలిపారు.
విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నీ ప్రభుత్వం కట్టడం లేదని సీరియస్ అయ్యారు.
జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో విద్యార్థులకు మీరు ఎంత చదివితే అంత… చదివిస్తాను అని హామీ ఇచ్చారు.
మీ మామయ్యా చదివిస్తారు అంటూ డైలాగులు వేశారు.కానీ ఇప్పుడు విద్యార్థుల ఫీజులు చెల్లింపులు ముద్దుల మామయ్య జగన్ ప్రభుత్వం చెల్లించటం లేదని తెలిపారు.
ముద్దుల మామయ్య రాష్ట్రాన్ని బాగా చూసుకుంటే తనకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళు ఎవరూ ఉండరని పవన్ స్పష్టం చేశారు.కానీ ముద్దుల మామయ్య ఎక్కువగా విదేశాల్లో తిరుగుతున్నారని వ్యంగ్యంగా విమర్శించారు.
కొన్ని సందర్భాలలో విమర్శించాలంటే సంస్కారం తన నోటిని కట్టేస్తుందని పవన్ చెప్పుకోచ్చారు.