పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసుకొని క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాకి రెడీ కావాల్సి ఉంది.అయితే కరోనా మహమ్మారి వచ్చి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ మొత్తం డిస్టర్బ్ చేసింది.
సినిమా షూటింగ్ లు అన్ని కూడా ఆగిపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి.ఇక క్రిష్ సినిమా కోసం ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో కోటిన్నర పెట్టి ఓ భారీ సెట్ ని వేశారు.
అయితే షూటింగ్ ఆగిపోవడంతో పాటు, గత కొంత కాలంగా విపరీతమైన వర్షాలు పడటంతో ఈ సెట్ మొత్తం పాడైపోయింది.సినిమాలోని కీలక సన్నివేశాలు ఆ సెట్ లో జరగాల్సి ఉన్నాయని తెలుస్తుంది.
సముద్రం ఇంకా భారీ ఓడ సెట్ ను అల్యూమీనియం ఫ్యాక్టరీలో వేయించారు.భారీ వర్షాల కారణంగా ఏకంగా కోటి రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది.
ఇక దాదాపు మూడు నెలల విరామం తర్వాత వకీల్ సాబ్ చిత్రీకరణ ప్రారంభం అయ్యింది.పవన్ కళ్యాణ్ ఒకటి రెండు రోజుల్లో వకీల్ సాబ్ చిత్రీకరణలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
నెల రోజుల వకీల్ సాబ్ షెడ్యూల్ పూర్తి చేసి క్రిష్ సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొనాల్సి ఉంది. ఆగస్టు నుండి క్రిష్ మూవీ మొదలు పెట్టాలనుకున్నాడు.
అయితే ఇంతలో ఆ సెట్ నాశనం కావడంతో ఇప్పుడు మళ్ళీ దానిని రీసెట్ చేయాల్సిన అవసరం వచ్చింది.ఈ కారణంగా మూవీ షూటింగ్ మళ్ళీ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.