తమిళనాడు సీఎంకి పవన్ థాంక్స్! పవన్ పై ప్రశంసలు

కరోనా

ప్రభావంతో దేశం యావత్తు

లాక్ డౌన్

లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే.ఈ నేపధ్యంలో వలస కూలీల నుంచి, మత్స్యకారుల వరకు చాలా మంది ఇతర రాష్ట్రాలలో ఉండిపోయారు.

 Pawan Kalyan Says Thanks To Tamil Nadu Cm, Ap Politics, Corona Virus, Covid-19-TeluguStop.com

వారు అక్కడ ఉండలేని పరిస్థితి, ఇక్కడికి రాలేని స్థితిలో ఉన్నారు.ఇక సామాజిక అంశాలపై ఎప్పుడు స్పందిస్తూ వాటిని పరిష్కరించే జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా చెన్నై తీరంలో చిక్కుక్కున్న సిక్కోలుకి చెందిన మత్స్యకారులని ఆదుకోవాలని

తమిళనాడు సిఎం పళని స్వామి

కి ట్వీట్ చేశారు.దీనిపై పళనిస్వామి కూడా స్పందించారు.

పవన్ కళ్యాణ్

అభ్యర్ధనని పరిగణంలోకి తీసుకొని

చెన్నై కార్పోరేషన్

అధికారులతో మాట్లాడి మత్స్యకారులకి అవసరమైన ఆహారాన్ని అందించారు.

ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్

తమిళనాడు ముఖ్యమంత్రి

కి కృతజ్ఞతలు తెలియజేశారు.చెన్నై కార్పొరేషన్ అధికారులకు కూడా పవన్ కృతజ్ఞతలు తెలిపారు.ఇక ఈ ఘటన తమిళ సినీ వర్గాల్లో కూడా ఆసక్తికరంగా మారింది.తమిళ హీరో మాధవన్ సైతం పవన్ తీరును మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు.మత్స్యకారులు చిక్కుకుపోయిన ఘటనను తన దృష్టికి తీసుకొచ్చిన జనసైనికులకు పవన్ కృతజ్ఞతలు తెలిపాడు.

సోంపేట మండలం, సిహెచ్.గొలగండి గ్రామం – మత్స్యకారులు

, లాక్ డౌన్ వలన,

చెన్నై

తీరా ప్రాంతంలో చిక్కుకు పోయిన సమస్యని, పార్టీ దృష్టికి తీసికొచ్చినందుకు, మత్స్య కార్మికుల కుటుంబాలకు అండగా నిలబడినందుకు, ఇచ్ఛాపురం జనసేన నాయకులు.దాసరి రాజుని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అంటూ పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube