మన ఇండియాలో ప్రజలకు ఇష్టమైన రెండే రెండు వాటిల్లో ఒకటి క్రికెట్ కాగా మరొకటి సినిమా.ఈ రెండు అంటే ఫ్యాన్స్ చెవులు కోసేసుకుంటారు.
ఈ రెండింటికి కూడా ఇండియాలో ఉన్న ఆదరణ వేరే దేశంలో తక్కువ అనే చెప్పాలి.మరి క్రికెట్ లో ఐపీఎల్ మ్యాచ్ లకు మరొక ప్రత్యేకమైన అభిమానం చూపిస్తుంటారు.
ఈ లీగ్ మ్యాచ్ లు క్రికెట్ ఎప్పుడు చూడని వారికీ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు.
ప్రతీ ఏడాది సమ్మర్ లో ఆడియెన్స్ ను అలరించడానికి టీమ్స్ మొత్తం ఐపీఎల్ మ్యాచ్ లు ఆడుతుంటారు.
మరి ఈసారి కూడా పోటాపోటీగా మ్యాచ్ లు జరుగగా నిన్న ఫైనల్ జరిగింది.ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్( IPL Final ) నిన్న జరుగగా ఇందులో పలు ట్విస్ట్ లు చోటుచేసుకుని మ్యాచ్ ను మరింత ఉత్సాహంగా మార్చేశాయి.
భారీ ఉత్కంఠ తర్వాత ఈసారి ఐపీఎల్ 2023 విజేతగా చెన్నై( CSK ) నిలిచింది.
గుజరాత్ టైటాన్స్( GT ) ఇచ్చిన భారీ లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఛేదించి చివరి నిముషంలో గెలవదు అనుకున్న మ్యాచ్ ను గెలిచేలా ఆడారు.దీంతో చెన్నై 5వ సారి కప్ గెలిచింది.దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ లో నిన్న రాత్రి నుండే సంబరాలు స్టార్ట్ అయ్యాయి.
ఈ క్రమంలోనే స్టార్ స్పోర్ట్స్ తెలుగు వారు కూడా అదిరిపోయే పోస్టర్ ను డిజైన్ చేసి వదిలింది.
ఈ పోస్టర్ పవన్ ఫ్యాన్స్ లో కూడా వైరల్ అయ్యింది.ఎందుకంటే పవన్, సాయి తేజ్ నటిస్తున్న బ్రో సినిమా నుండి లేటెస్ట్ గా వచ్చిన ఇద్దరి పోస్టర్ ను వాడేశారు.పవన్ ప్లేస్ లో ధోనీ, తేజ్ ప్లేస్ లో జడేజా ఫోటోను పెట్టి అదిరిపోయే పోస్టర్ ను డిజైన్ చేశారు.ఇంక్రెడిబుల్ విక్టరీ.5వ సారి ఛాంపియన్స్ అయిన చెన్నై టీం.మరి ఫ్యాన్స్ మీ ఫీలింగ్.ఏంటో కామెంట్ చెయ్యండి.
అంటూ వదిలిన ఈ పోస్టర్ అటు ధోనీ ఫ్యాన్స్ లో ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్ లో మంచి వైరల్ అయ్యింది.