లాక్ డౌన్ తర్వాత పొలిటికల్ గా కేవలం సోషల్ మీడియాకే పరిమితం అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరల మునుపటి వేగం అందుకోవడానికి రెడీ అవుతున్నాడు.ఈ నేపధ్యంలో ఈ మధ్య కాలంలో తరుచుగా జిల్లాల వారీగా జనసేన నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ స్థానిక పరిస్థితులని అడిగి తెలుసుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో తాజాగా విశాఖలోని జనసేన నేతలతో ఆయన ముచ్చటించారు.ఈ సందర్భంగా విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన, విశాఖలో ప్రభుత్వ భూమి, ఆస్తుల అమ్మకాలపై చర్చించారు.
అలాగే పెరిగిన కరెంటు బిలులు, డాక్టర్ సుధాకర్ ఘటన మీద కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు.
ఎల్జీ పాలిమర్స్ బాధితుల అంశంలో ప్రభుత్వం సరిగా స్పందించకపోతే ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.గ్యాస్ లీక్ బాధితులకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు.జిల్లాలోని స్థానిక నాయకులు గ్యాస్ లీక్ బాధితులకి జనసేన పార్టీ తరుపున భరోసా ఇవ్వాలని సూచించారు.అంతేగాకుండా, పేదలను మభ్యపెట్టకుండా అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అన్నారు.ప్రభుత్వ ఆస్తుల వేలం, అధిక విద్యుత్ బిల్లులు, మద్యం అమ్మకాలపై క్షేత్రస్థాయి నుంచి పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇటీవల సస్పెండైన డాక్టర్ సుధాకర్ ను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.