పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల తర్వాత కమ్ బ్యాక్ మూవీగా వస్తున్న సినిమా వకీల్ సాబ్.మరొక రెండు రోజుల్లో విడుదల కాబోతుండగా ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ తో పాటు అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
వకీల్ సాబ్ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు.ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాను దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తం గా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా పింక్ సినిమా రీమేక్ గా తెరకెక్కుతుంది.బాలీవుడ్ లో పింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటించారు.
ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించబోతున్నాడు.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాకు ఇప్పటికే ప్రమోషన్స్ భారీ లెవల్లో ఇస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమా మొత్తం నిడివి 155 నిముషాలు ఉంది.ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ జరీ చేసారు.ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించబోయే నిడివి పైన కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
ఈ సినిమాలో పవన్ స్క్రీన్ స్పేస్ 50 నిముషాలు ఉంటుందట.
ఒరిజనల్ సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్ర చాలా తక్కువుగా ఉంటుంది.
కానీ తెలుగులో కొన్ని సీన్స్, ఫైట్స్ యాడ్ చేయడం వల్ల ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 50 నిముషాల పాటు కనిపించబోతున్నాడు.అయితే ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా కోసం పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఇండస్ట్రీలో పెద్ద టాక్ నడుస్తుంది.50 నిముషాల్లో కనిపించబోతున్న పవన్ కళ్యాణ్ 50 కోట్లు తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది.