టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగి పోయాయి.ఒకప్పుడు స్టార్ హీరోలు పెద్ద మొత్తంలో పారితోషికాలు తీసుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చేవి.
కాని ఇప్పుడు పారితోషికంతో పాటు లాభాల్లో వాటా.ఏరియాల హక్కులు ఇలా రకరకాలుగా తీసుకుంటున్నారు.
పైగా సినిమా కోసం ఖర్చు చేస్తున్న దాని కంటే ఎక్కువగా హీరోలకు పారితోషికాలు ఇస్తున్నారు.ఈమద్య వచ్చిన వకీల్ సాబ్ సినిమా మేకింగ్ కంటే కూడా అధికంగా పవన్ కళ్యాణ్ పారితోషికం అయ్యిందని టాక్ వచ్చింది.
ఇక మహేష్ బాబుతో పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా విషయంలో కూడా అదే జరుగుతుందట.సర్కారు వారి పాట బడ్జెట్ లో సగానికి పైగా మహేష్ బాబు పారితోషికంగా చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియు్ రీమేక్ బడ్జెట్ లో సగానికి పైగా పవన్ కళ్యాణ్ పారితోషికం ఉందని అంటున్నారు.రానా ఇతర నటీ నటుల పారితోషికం మరియు మేకింగ్ ఖర్చు టెక్నీషియన్స్ పారితోషికం ఇలా అన్ని కలిపినా కూడా పవన్ కళ్యాణ్ పారితోషికం అంతగా రావడం లేదంటున్నారు.ఇక హరీష్ శంకర్ మూవీ కూడా అదే పరిస్థితి.ఆ సినిమాకు గాను పవన్ కళ్యాణ్ దాదాపుగా 50 రోజులు వర్క్ చేయబోతున్నాడట.అందుకు గాను ఆయనకు 40 కోట్ల పారితోషికం దక్కబోతుంది.ఇక హీరోయిన్ మరియు టెక్నీషియన్స్ పారితోషికం ఇతర ఖర్చులు అన్ని కలిపి కూడా 30 నుండి 35 కోట్ల రూపాయలు కావడం లేదట.
అంటే సినిమా మొత్తం బడ్జెట్ 80 కోట్ల లోపు కాగా అందులో 40 కోట్ల వరకు పవన్ పారితోషికం ఉంటుందని అంటున్నారు.ఇలా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ కు కూడా చేస్తున్నారు.
హరి హర వీరమల్లు సినిమాకు కూడా అదే రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నాడు.కాని ఆ సినిమా వీఎఫ్ఎక్స్ ఖర్చు దాదాపుగా 50 కోట్లు అంటున్నారు.