పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వం లో సినిమా కన్ఫామ్ అయ్యింది.ఈ సినిమా ను టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో ఆర్ఆర్ఆర్ సినిమా ను నిర్మించిన దానయ్య నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
ఈ సినిమా కోసం దానయ్య దాదాపుగా 170 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు చేయబోతున్నాడు అంటూ సమాచారం అందుతుంది.భారీ గ్యాంగ్ స్టార్ కథ తో ఈ సినిమా ను దర్శకుడు సుజిత్ రూపొందించబోతున్నాడని కూడా ప్రచారం జరుగుతుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కు గాను పవన్ కళ్యాణ్ కి నిర్మాత ఏకంగా 70 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చేందుకు కమిట్ అయ్యాడని.అందులో భాగంగా ఇప్పటికే 25 కోట్ల రూపాయల అడ్వాన్సు ని కూడా చెల్లించారని చెబుతున్నారు.
షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయిన సమయం లో మరో 30 నుండి 40 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కూడా పవన్ కళ్యాణ్ కి అందబోతుంది.మొత్తంగా ఈ సినిమా కు పవన్ కళ్యాణ్ భారీ మొత్తం లో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువ రోజులు డేట్లు ఇవ్వాల్సి ఉందట.అందుకే ఇంత భారీ పారితోషికం అందుకుంటున్నాడు అంటూ సమాచారం అందుతుంది.హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ కళ్యాణ్ దాదాపుగా 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.
ఇప్పుడు ఈ సినిమా కు అంతకు మించి డేట్లు ఇవ్వాల్సి ఉందట.అందుకే ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు అనే సమాచారం ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతుంది.ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు వచ్చే ఏడాది సమ్మర్ నుండి మొదలయ్యే అవకాశాలున్నాయి.
పవన్ కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఈ పారితోషికం తక్కువే అంటూ ఆయన అభిమానులు మాట్లాడుకుంటున్నారు.