మెగా ఫ్యామిలీ నుంచి మెగా బ్రదర్ నాగబాబుని అంజనా ప్రొడక్షన్ బ్యానర్ పై చిరంజీవి నిర్మాతగా నిలబెట్టాడు.అయితే ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి మంచి సినిమాలు నిర్మించిన కూడా పెద్దగా డబ్బులు తీసుకొచ్చే సినిమాలు రాలేదనే చెప్పాలి.
ఈ బ్యానర్ లో ముగ్గురు మొనగాళ్ళు, భావగారు బాగున్నారా సినిమాలు మాత్రమే కమర్షియల్ హిట్స్ అయ్యాయి.మిగిలిన సినిమాలు అన్ని కూడా డిజాస్టర్ , ఎవరేజ్ టాక్ తెచ్చుకున్నవే.
దీంతో నిర్మాతగా నాగబాబుకి ఏ సినిమాలు పెద్దగా డబ్బులు తెచ్చిపెట్టలేదు.అయితే రామ్ చరణ్ తో 11 ఏళ్ల క్రితం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఆరెంజ్ సినిమా అయితే నిర్మాతగా నాగబాబుని కోలుకోలేని దెబ్బ తీసింది.
ఆ సినిమాకి భారీ నష్టాలు వచ్చాయి.
ఇక ఆ నష్టాల నుంచి బయటపడటానికి చివరికి నాగబాబు సీరియల్స్ లో కూడా నటించాల్సి వచ్చింది.
ఇక పవన్ కళ్యాణ్ తో చేసిన గుడుంబా శంకర్ సినిమా కూడా నిర్మాతగా నాగబాబుకి భారీ నష్టాలు మిగిల్చింది.ఈ నేపధ్యంలో తన అన్నని మళ్ళీ నిర్మాతగా నిలబెట్టే బాద్యతని పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం పవర్ స్టార్ వరుస సినిమాలని లైన్ లో పెట్టాడు.ఈ నేపధ్యంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడు.
ఈ సినిమాని కోప్రొడ్యూసర్ గా నాగబాబుకి కూడా నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించినట్లు తెలుస్తుంది.దీని తర్వాత పూర్తి స్థాయి నిర్మాతగా ఒక సినిమా చేసి పెట్టాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.
మరి నాగబాబు నిర్మాతగా పవన్ కళ్యాణ్ సినిమాని ఎప్పుడు మొదలు పెడతాడు అనేది వేచి చూడాలి.