పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ కలిగిన హీరో అని అందరికీ తెలుసు.ఒకపక్క రాజకీయం మరోపక్క సినిమారంగంలో విజయవంతం గా రాణిస్తున్న పవన్.
తాజాగా తన కెరీర్లో షూటింగ్ స్టార్ట్ చేసి ఆగిపోయిన “సత్యాగ్రహి” సినిమానీ గుర్తు చేసుకోవడం జరిగింది.అప్పట్లో పవన్ కళ్యాణ్ ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని… ప్రారంభించడం జరిగింది.
ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి రేణుదేశాయ్ తో పాటు అకీరానందన్ కూడా వచ్చారు. ఇండస్ట్రీ నుండి వెంకటేష్, నితిన్, అల్లు అర్జున్ వచ్చారు.
శ్రీ సూర్య మూవీస్.ఏ ఎమ్ రత్నం.
ఈ సినిమాని నిర్మించడానికి రెడీ అయ్యి పోస్టర్ కూడా చేయగా.ఆ తర్వాత సినిమా ఆగిపోయింది.
ఆ టైంలో పోస్టర్ చూసి ఈ సినిమా కచ్చితంగా చరిత్ర సృష్టిస్తుందని పవన్ ఆలోచనలకు దగ్గరి స్క్రిప్టు.అనీ సినిమా కోసం.అభిమానులు ఎదురు చూశారు.కానీ అర్థంతరంగా సినిమా ఆగిపోయింది.
ఈ నేపథ్యంలో తాజాగా పవన్ సత్యాగ్రహి సినిమా అని గుర్తు చేసుకున్నారు.విషయంలోకి వెళితే.‘లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో జరిగిన నాటి ఎమర్జన్సీ కాలం నాటి ఉద్యమాన్ని ప్రేరణగా తీసుకుని చేయాలనుకున్న చిత్రం అది.2003లో అనుకుంటా, దాని ప్రారంభం కూడా జరిగింది.అంతలోనే అది ఆగిపోయింది.అయితే, ఆ సినిమాలో నటించడం కన్నా, ఇప్పుడు నిజ జీవితంలో ఆలా ప్రవర్తించగలగడమే నాకు సంతృప్తిని ఇస్తోంది’ అంటూ సోషల్ మీడియా లో రీసెంట్ గా పవన్ కామెంట్ పెట్టాడు.దీంతో… పవన్ పెట్టిన ఈ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.కొంతమంది సినిమా స్టార్ట్ చేయండి అని అభిమానులు కోరుతున్నారు.