పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా భీమ్లా నాయక్సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయినా అయ్యప్పనుమ్ కోషియం అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
అయితే మన తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ నమ్ముతున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా ఫస్ట్ గ్లిమ్స్, మేకింగ్ వీడియో, ఫస్ట్ సింగిల్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.
అయితే ఈ సినిమా నుండి మ్యూజిక్ కూడా పెద్ద హిట్ అయ్యిందని ఫస్ట్ సింగిల్ తోనే తెలిసి పోయింది. ఫస్ట్ సింగిల్ విడుదల అయ్యి వారలు గడుస్తున్న ఇంకా ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది.
ఇక ఇప్పుడు భీమ్లా నాయక్ టీమ్ మరొక అప్డేట్ తో రెడీ అవుతున్నారు.
ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అవవడంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సెకండ్ సింగిల్ ను విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే సెకండ్ సింగిల్ కు సంబంధించిన వర్క్ కూడా రెడీ చేసినట్టు తెలుస్తుంది.ఇప్పటికే రామజోగయ్య శాస్త్రి ఈ పాటను త్రివిక్రమ్ కు వినిపించగా ఆయన పాజిటివ్ గా స్పందించినట్టు టాక్.
ఈ సెకండ్ సింగిల్ కూడా పెద్ద హిట్ అవుతుందని త్రివిక్రమ్ తెలిపాడట.
ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న థమన్ కూడా ఈ సెకండ్ సింగిల్ పై ఆసక్తిగా ఉన్నట్టు కనిపిస్తుంది.తాజాగా థమన్ భీమ్లా నాయక్ సెకండ్ సింగిల్ ‘అంత ఇష్టం పాటను విడుదల చేయబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.ఇక ఈ సినిమా సెకండ్ సింగిల్ అక్టోబర్ 15న దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది.
ఇక మొత్తానికి మరొకసారి రికార్డ్ బద్దలు కొట్టడానికి భీమ్లా నాయక్ బయల్దేరుతున్నాడు.