అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళు గ్యాప్ తీసుకొని మరల పింక్ సినిమా రీమేక్ తో మేనెలలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఇక ఇప్పటికే షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలు ఇప్పటికే షూట్ చేసినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొదటి సారి ఈ సినిమా కోసం తమన్ సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
మరో వైపు పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడం తన డ్రీం అని చెప్పిన దిల్ రాజు దాని కోసం చాలా కసిగా పనిచేస్తున్నారు.
మరో రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యంలో ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్, మ్యూజిక్ పనులు కూడా కానిచ్చేస్తున్నారు.
ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కి సంబందించిన అప్డేట్ ని సంగీత దర్శకుడు తమన్ అందించారు.మరి కొద్ది రోజుల్లో ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ సింగిల్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు తెలిపాడు.
పవన్ తో చేస్తున్న మొదటి సినిమా కాబట్టి చాలా శ్రద్ధగా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు ట్విట్టర్ లో తెలియజేశాడు.