పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు.ఇప్పటికే ఆ విషయం అధికారికంగా క్లారిటీ వచ్చేసింది.
పవన్ మూడు సినిమాలు కూడా తక్కువ గ్యాప్ లోనే విడుదల కాబోతున్నాయి.మొదట వకీల్ సాబ్ మరియు క్రిష్ దర్శకత్వంలో సినిమాలు మాత్రమే ఈ ఏడాది వస్తాయని భావించారు.
కాని అనూహ్యంగా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.
ఈ సినిమాలో మరో హీరోగా రానా నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
పవన్ సినిమాలు అంటే ఎప్పుడు కూడా అభిమానులు కోట్ల అంచనాలు పెట్టుకుని ఉంటారు.ఇప్పుడు కూడా ఈ సినిమా ల విషయంలో అంచనాలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి.
మొదటగా ఏప్రిల్ లేదా మే నెలలో వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.ఆ వెంటనే భారీ ఎత్తున అంచనాలున్న క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రాబోతుంది.
ఈ రెండు సినిమాలతో పాటు నిన్న షూటింగ్ ప్రారంభం అయిన పవన్ రానాల మల్టీ స్టారర్ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.రికార్డు బ్రేకింగ్ సినిమాలు ఇవి కనుక ఈ ఒక్క ఏడాదిలోనే పవన్ అరుదైన రికార్డులను దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.
ఈ మద్య కాలంలో ఏ ఒక్క హీరో కూడా ఒక్క ఏడాది మూడు సినిమాలు చేసిన దాఖలాలు లేవు.కనుక ఈ మూడు సినిమాలు హిట్ అయితే పవన్ రికార్డును రాబోయే రోజుల్లో కూడా ఎవరు బ్రేక్ చేయలేరు.
ఈ మూడు సినిమాలతో అభిమానులకు పండుగే పండుగ.