కరోనా కారణంగా గత ఏడాది చాలా సినిమాలు రీ షెడ్యూల్ అయ్యాయి.షూటింగ్ లు క్యాన్సిల్ అయ్యాయి విడుదల ఆగిపోయాయి.
ఇలా ఎన్నో విధాలుగా టాలీవుడ్ లో సినిమా లు బ్రేక్ పడ్డాయి.ఈ ఏడాది ఆరంభంలో మొత్తం పరిస్థితి సర్దుకుంది అనుకుంటూ పదుల కొద్ది సినిమా ల విడుదల తేదీలను ఖరారు చేయడం జరిగింది.
కాని అవన్నీ ఇప్పుడు ఎక్కడికి అక్కడ ఆగి పోయే పరిస్థితి వచ్చింది.ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం పెద్ద హీరోల సినిమాలు దాదాపు అన్ని కూడా ఈ ఏడాది నుండి మొత్తంగా క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది.
ఈ జాబితాలో పవన్ సినిమా లు చాలానే ఉన్నాయి.పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత పక్కా వ్యూహంతో బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా సినిమా లను ప్లాన్ చేసుకున్నాడు.
కాని మొత్తం పరిస్థితి తలకిందులు అయ్యింది.ఆయన సినిమా లు అన్ని కూడా రీ షెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు.
మొన్నటి వరకు పవన్ ప్లాన్ ప్రకారం రానాతో కలిసి చేస్తున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలి.ఇక క్రిష్ దర్శకత్వం లో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలి, హరీష్ శంకర్ దర్శకత్వం లో చేయాల్సిన సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ లో అనుకున్నాడు.
ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వం లో సినిమా ను వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభించి వచ్చే ఏడాది దసరా వరకు విడుదల చేయాలనుకున్నాడు.ఇలా పక్కా ప్లాన్ ప్రకారం సినిమా లను కమిట్ అయ్యాడని కాని కరోనా సెకండ్ వేవ్ వల్ల మళ్లీ సినిమా ల షూటింగ్ లు మరియు విడుదల తేదీలు మొత్తం రీ షెడ్యూల్ చేయాల్సి వచ్చింది.
ఈ ఏడాది లో వకీల్ సాబ్ తో పవన్ వచ్చాడు.అంతకు మించి మరే సినిమా ఈ ఏడాది పవన్ నుండి వస్తుందనే నమ్మకం లేదని అంటున్నారు.