పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేసిన పవన్, ఆ తరువాత దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు.
ఈ సినిమా షూటింగ్ మొదలుకాకముందే తన నెక్ట్స్ చిత్రాన్ని మరో డైరెక్టర్ హరీష్ శంకర్తో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.ఇక ఈ మూడు సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుండగా, మరో సర్ప్రైజ్ను పవన్ ఇచ్చాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్న నెక్ట్స్ చిత్రంలో పవన్ నటించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఈ సినిమాను సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నట్లు వారు తెలిపారు.
దసరా కానుకగా ఈ చిత్ర అఫీషియల్ అనౌన్స్మెంట్ను చేశారు.అయితే ఈ సినిమాతో నేచురల్ స్టార్ నానిపై రివెంజ్ తీర్చుకునేందుకు సదరు నిర్మాత ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రానికి తొలుత నాగవంశీ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు.అయితే బడ్జెట్ విషయంలో వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆ సినిమా నుండి నాగవంశీ తప్పుకున్నాడట.
దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసి ‘శ్యామ్ సింగ రాయ్’కు ఉన్న క్రేజ్ను తగ్గించేందుకు ఈ సినిమాను అనౌన్స్ చేశాడట ఈ ప్రొడ్యూసర్.దసరా కానుకగా శ్యామ్ సింగ రాయ్ కాన్సెప్ట్ పోస్టర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
దీంతో ఈ సినిమా క్రేజ్ను తగ్గించేందుకు పవన్ చిత్రాన్ని అస్త్రంలా వాడి సక్సెస్ అయ్యాడు ఈ నిర్మాత.మొత్తానికి దసరా నాడు నానిపై సదరు నిర్మాత బాగానే రివెంజ్ తీసుకున్నాడని ఫిలింనగర్లో టాక్ వినిపిస్తోంది.