పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి – అల్లు ఫ్యామిలికి సరైన సంబంధాలు లేవనేది జగమెరిగిన సత్యం.ఆమధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ విషయాన్ని రుజువు చేసాయి కూడా.
అల్లు శిరీష్ పర్సనల్ చాట్ లో పవన్ గురించి చెడుగా మాట్లాడటం, అది కాస్త బయటకి లీక్ అవడం, అంతకుముందు అల్లు అర్జున్ “చెప్పను బ్రదర్” ఇష్యూ జరగడంతో పవన్ – అల్లు ఫ్యామిలి మధ్య అప్పటికే ఉన్న దూరం కాస్త మరింత పెరిగిపోయింది.
పవన్ కళ్యాణ్ తో మళ్ళీ సత్సంబంధాలు నెలకొల్పేందుకు అల్లు ఫ్యామిలి ఎన్నో ప్రయత్నాలు చేసింది.
సరైనోడు ఆడియో ఫంక్షన్ కి ఆహ్వానం పంపినా పవన్ రాలేదు.మధ్యమధ్యలో చిరంజీవి – చరణ్ ని కలిసిన పవన్, అల్లువారి ఇంటివైపు మాత్రం వెళ్ళలేదు.
పవన్ లాగే పవన్ ఫ్యాన్స్ కూడా అల్లు ఫ్యామిలిపై పగబట్టేసారు.డీజే టీజర్ కి డిస్ లైక్స్ కొట్టడం గురించి మీకు తెలిసిందే.
ఇంత నెగెటివిటి ఎందుకు, పవన్ తో సంబంధాలు మెరుగుపరుచుకుందాం అని బన్ని అనుకుంటున్నాడు.పవన్ కి డీజే – దువ్వాడ జగన్నాథం స్పేషల్ షో చూపించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇందుకోసం పవన్ కళ్యాణ్ టీమ్ ని సంప్రదించారు.కాని పవన్ దగ్గరి నుంచి ఇప్పటివరకైతే ఎలాంటి స్పందన లేదంట.
పవన్ రావడం దాదాపుగా జరగని పని అని అభిప్రాయపడుతున్నారు ఫిలింనగర్ ప్రజలు.