పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉండేవాడు.కానీ మళ్ళీ సినిమాల్లోకి వచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేసాడు.
ఈ మధ్యనే వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వెండితెరపై కనిపించాడు.
వకీల్ సాబ్ లాంటి సందేశాత్మక మూవీతో ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులతో పాటు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకున్నాడు.
ఈ సినిమా తర్వాత పవన్ సాగర్ కె దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ ఆయిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రం రీమేక్ లో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుపాటి కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాకు హరిహర వీరమల్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.ఈ రెండు సినిమాల షూటింగ్ ను ఒకేసారి చేస్తూ ఎప్పుడు లేనంత ఫాస్ట్ గా సినిమాలను పూర్తి చేస్తున్నాడు.అయితే ఇప్పుడు పవన్ మరొక క్రేజీ ప్రాజెక్ట్ లైన్లో పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ పూరీ జగన్నాథ్ కాంబోలో మరొక సినిమా రాబోతున్నట్టు సోషల్ మీడియా లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.
ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి.అందుకే వీరి కాబినేషన్ అంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవ్వబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఒక ప్రముఖ సంస్థ ఈ సినిమా కోసం లైన్లో ఉన్నట్టు తెలుస్తుంది.
చూడాలి మరి ఈ వార్తలో నిజమెంతో.