పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత దాదాపు రెండేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.మళ్ళీ పవన్ సినిమా చేస్తాడా లేదా అనుకుంటున్న సమయంలో బాలీవుడ్ హిట్ మూవీ పింక్ ను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు గా అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రీమేక్ ను ఈ సంవత్సరంలోనే సమ్మర్ చివర్లో విడుదల చేయాలని భావించారు.
కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడింది.
గత ఆరు నెలలుగా సినిమా షూటింగ్ లేకపోవడంతో షూటింగ్ జరపలేదు.
ఎట్టకేలకు సినిమాల షూటింగ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వకీల్ సాబ్ చాటింగ్ కూడా ప్రారంభించినట్లు గా తెలుస్తోంది.నిన్న మొన్నటి వరకు ఈ సినిమా సంక్రాంతికి వస్తుంది అంటూ ప్రచారం జరిగింది.
అయితే షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు ఎలా విడుదల చేస్తారు అంటూ కొందరు ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు.తాజాగా షూటింగ్ పునః ప్రారంభం అవడంతో ఇప్పుడు సంక్రాంతికి సినిమా వచ్చే అవకాశం ఉందని అంతా నమ్ముతున్నారు.
సినిమా కచ్చితంగా సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో అన్ని వర్గాల వారు మరియు ప్రేక్షకులు మెగా అభిమానులు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా శృతిహాసన్ నటిస్తోంది.కీలక పాత్రలో అంజలి మరియు నివేద థామస్ నటిస్తున్నారు.
పింక్ కు కమర్షియల్ టచ్ ఇచ్చి ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు గా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.పవన్ దాదాపు మూడేళ్ల తర్వాత రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి.
మరి అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.