పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు.
కాగా ఈ సినిమాను గతేడాదే రిలీజ్ చేయాలని చూసినా, కరోనా కారణంగా అది కుదర్లేదు.దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి క్యూలో పెడుతూ దూసుకుపోతున్నాడు పవన్.
అయితే ఈ ఏడాదిలో రెండు సినిమాలను ఖచ్చితంగా రిలీజ్ చేయాలని పవన్ భావిస్తున్నాడు.
ఇందులో భాగంగా ఇప్పటికే క్రిష్ చిత్ర షూటింగ్ను ప్రారంభించిన పవన్, ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు.అయితే తన నెక్ట్స్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించిన పవన్, ఇప్పట్లో క్రిష్ చిత్రాన్ని పూర్తి చేసే అవకాశం లేదని తెలుస్తోంది.
దీంతో క్రిష్ చిత్ర షూటింగ్ను ప్రస్తుతానికి పక్కనబెట్టినట్లు కనిపిస్తుంది.కాగా సాగర్ చంద్ర డైరెక్షన్లో పవన్ తన నెక్ట్స్ ప్రాజెక్టు షూటింగ్ను కూడా తాజాగా ప్రారంభించాడు.దీంతో క్రిష్ డైరెక్షన్లో రాబోయే సినిమా ఈ ఏడాదిలో రిలీజ్ కావడం కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు.
ఇక వకీల్ సాబ్ చిత్రాన్ని వేసవి కానుకగా రిలీజ్ చేయనున్న పవన్, ఆ తరువాత సాగర్ చంద్ర సినిమాను ముందుగా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.
ఇక ఆ తరువాతే క్రిష్ సినిమాను రిలీజ్ చేసేందుకు పవన్ సిద్ధమవుతున్నాడట.ఈ లెక్కన వకీల్ సాబ్ చిత్రం తరువాత పవన్ తన 30వ చిత్రాన్ని ముందుగా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.కాగా సాగర్ చంద్ర డైరెక్షన్లో పవన్ నటిస్తున్న సినిమాలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.