పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్( Pawan Kalyan, Sai Dharam Tej ) కలిసి నటిస్తున్న చిత్రం బ్రో.ఈ సినిమా పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ పూర్తయింది.
సాయి ధరమ్ తేజ్ యొక్క షూటింగ్ నడుస్తోంది.అతి త్వరలోనే షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి.
వచ్చే నెలలో ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
విడుదలకు ఇంకాస్త సమయం ఉండడంతో దర్శకుడు సముద్ర ఖని( Samudrakhani ) కాస్త అదనపు హంగులు దిద్దుతున్నట్లుగా తెలుస్తోంది.తమిళం లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతమ్( Vinodya Seetham ) సినిమా కు ఇది రీమేక్ అనే విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ ఎలా కనిపించబోతున్నారు అనేది ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ తో వెళ్లడైంది.
పవన్ కళ్యాణ్ ని దేవ దూత గా చూపించే సన్నివేశాలు ఉంటాయని సమాచారం అందుతుంది.అంతే కాకుండా ఈ సినిమా లో ఒక విభిన్నమైన కాన్సెప్ట్ ని చూపించబోతున్నారట.
అది తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా సర్ప్రైజింగ్ గా ఉంటుందని అంటున్నారు.
కొంత మంది పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ఇతరులు ఈ సినిమా గతం లో పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల( Gopala Gopala ) సినిమా కి కాస్త అటు ఇటుగా ఉంటుందేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కానీ ఆ విషయం లో అసలు డౌట్ అక్కర్లేదని ఈ సినిమా పూర్తి విభిన్నంగా ఉండి ప్రేక్షకులను అలరించబోతుందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల చివర్లో సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా ను నిర్మించడం జరిగింది.ఈ సినిమా లో నటించినందుకు గాను పవన్ కళ్యాణ్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.ఈ సినిమా కు ఆయన కేటాయించిన డేట్లు కేవలం 30 రోజులు మాత్రమే.30 రోజులు లోపు డేట్లతోనే సినిమా షూటింగ్ పూర్తి చేయడం జరిగింది.బ్రో సినిమా టైటిల్ విషయంలో తప్పితే అన్ని విషయాల్లో కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం ఖాయం అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.