పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తి అవ్వాల్సి ఉంది.కేవలం 45 రోజులు మాత్రమే భీమ్లా నాయక్ కు పవన్ డేట్లు ఇచ్చాడనే వార్తలు వచ్చాయి.
దర్శకుడు సాగర్ చంద్ర కూడా 40 రోజుల్లోనే సినిమాను పూర్తి చేయబోతున్నట్లుగా చెప్పాడు.తక్కువ సమయంలోనే సినిమాను పూర్తి చేయడం ద్వారా చాలా బడ్జెట్ సేవ్ అవుతుంది.
తద్వార ఎక్కువ లాభాలను దక్కించుకునే అవకాశం ఉంటుందని నిర్మాతలు భావించారు.కాని అనూహ్యంగా ఈ సినిమా చిత్రీకరణకు చాలా ఆలస్యం అవుతోంది.
పెద్ద మొత్తంల డేట్లను దర్శకుడు సాగర్ చంద్ర వినియోగిస్తున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి.సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
అయినా ఇప్పటికి కూడా షూటింగ్ ను పూర్తి చేయలేదు.
గత ఏడాది కాలంగా అదుగో ఇదుగో అంటూనే ఈ సినిమాను జరుపుతున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి.
షూటింగ్ మొదలు అయ్యి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు షూటింగ్ ను ముగించలేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ మరియు రానాల పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారని తెలుస్తోంది.వారం పది రోజుల్లో చిత్రీకరణ ముగిస్తామని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
మరి ఈసారి అయినా సినిమా చిత్రీకరణ ముగిస్తారా అనేది చూడాలి.సినిమా ఆర్ ఆర్ ఆర్ వల్ల కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.ఒక వేళ వాయిదా వేస్తే కనుక వెంటనే రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. పవన్ కు జోడీగా ఈ సినిమాలో నిత్యామీనన్ నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు పీక్స్ కు చేరాయి.
సినిమా విడుదల విషయంలో ఒకటి రెండు వారాల్లో క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.