జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్క మాట మీద నిలబడరని, ఎప్పుడు ఎలా మాట్లాడుతారో, ఎవరితో పొత్తు పెట్టుకుంటారో, ఎవరితో తెగదెంపులు చేసుకుంటారో ఆయనకే తెలీదు అన్నది వైసీపీ నేతల మాట.దీనిపై వపన్ మొన్నే క్లారిటీ కూడా ఇచ్చేశారు.
అంతలోనే పవన్ ఇచ్చిన మాటను మళ్లీ తప్పారని, ఆ మాత్రం దానికి ఒక్కసారి మాటిస్తే తప్పనని డైలాగులు కొట్టడం ఎందుకని వైసీపీ నాయకులు జోరుగా సెటైర్లు వేస్తున్నారు.ప్రస్తుతం ఈ చర్చ రావడానికి ప్రధాన కారణం ఎంటంటే.
కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గానికి ఉపఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే.స్థానిక ఎమ్మెల్యే అనారోగ్య సమస్యతో మరణించడంతో అక్కడి నుంచి అధికార పార్టీ వైసీపీ తరఫున వారి కుటుంబ సభ్యులు బరిలో దిగుతున్నారు.
దీనిపై పవన్ ఎమన్నారంటే తాము బద్వేలులో పోటీ చేయడం లేదని ప్రకటించారు.అప్పుడు పవన్ నిర్ణయం సరైందని అంతా భావించారు.కానీ రోజుల వ్యవధిలోనే ఆయన మాట మారుస్తాడని అనుకోలేదని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.ఎందుకంటే జనసేన అభ్యర్థి నిలబడకపోయిన మిత్రపక్షం కమలం పార్టీకి మద్దతుగా పవన్ ప్రచారం చేయనున్నట్టు ప్రకటించారు.
దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య ఫ్యామిలీపై పవన్కు నిజంగా గౌరవముంటే బీజేపీ తరఫున ప్రచారం చేయొద్దని అంటున్నారు.ఇలా చేస్తే నేరుగా బరిలోకి దిగకపోయిన పరోక్షంగా పోటీచేస్తున్నట్టే కదా అని కొందరి వాదన.అలాంటప్పుడు మాట ఇవ్వడం ఎందుకు? తప్పడం ఎందుకని విమర్శిస్తున్నారు కొందరు నాయకులు.
వైసీపీని ఓడించాలని జనసేనకు చాలా కసిగా ఉన్న విషయం తెలిసిందే.ఇలాగే తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో ఏం జరిగింది.జనసేన బీజేపీ కలిసి ప్రచారం చేసినా వైసీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందారు.ఆనాడు బీజేపీ తరపున స్టార్ క్యాంపెనర్లు ప్రచారం చేసినా ఫలితం శూన్యం.
ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందని వైసీపీ లీడర్స్ భావిస్తున్నారట.గతేడాది లానే ఈసారి కూడా బీజేపీ జనసేకు డిపాజిట్లు కూడా దక్కదని జోస్యం చెబుతున్నారు.
ఏదైమైనా బద్వేలులో పోటీలో నిలిచింది కాంగ్రెస్, బీజేపీ మాత్రమే.టీడీపీ ఎలాగూ పోటీ చేయనని ముందే చెప్పింది.కావున వైసీపీ నేతలు రికార్డు స్థాయి మెజార్టీపై కన్నేసినట్టు తెలుస్తోంది.ఈ మాత్రం దానికి జనసేన, బీజేపీ ప్రచారం చేస్తే తమ అభ్యర్థి గెలుస్తాడా? అని వెటకారం చేస్తున్నారు.తిరుపతి ఉపఎన్నికల్లో పవన్ సత్తా ఎంటో అందరికీ తెలిసింది.ఇక బద్వేలులో ఏం చేస్తాడో చూద్దామంటూ సవాళ్లు విసురుతున్నారు వైసీపీ లీడర్లు.