జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు గుంటూరు వచ్చారు.మంగళగిరి లో ఉన్న జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో నాయకులతో విస్తృత సమావేశానికి రెడీ అయ్యారు.భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్ర నాయకులతో పవన్ చర్చించనున్నారు.ముఖ్యంగా బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించి కడప జిల్లా నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు.బద్వేల్ ఉప ఎన్నికలలో పోటీ చేసే అంశంపై కడప జిల్లా నేతల దగ్గర అభిప్రాయాలు తీసుకునే ఆలోచనలో పవన్ ఉన్నట్లు పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
ప్రభుత్వ విధానాలు క్షేత్రస్థాయి పర్యటనలు.రోడ్ల మరమ్మతు కు సంబంధించి సమాధానం పై నేతలతో ఈ సమావేశంలో చర్చించనున్నారు.ప్రభుత్వ విధానాలు రోడ్ల మరమ్మతులు కార్యక్రమానికి సంబంధించి అక్టోబర్ రెండవ తారీకున చేపట్టబోయే సమాధానం కార్యక్రమం గురించి కూడా నేతలతో.
ఈరోజు పార్టీ ప్రధాన కార్యాలయంలో చర్చించనున్నారు.ఇదిలా ఉంటే పోసాని కృష్ణ మురళి నిన్న హైదరాబాద్ రేస్ క్లబ్ లో.దారుణంగా విమర్శలు చేయడంతో వాటికి ఈ కార్యక్రమంలో పవన్ ఏ విధంగా స్పందిస్తారు అన్నది.అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.