ఒత్తిడి పెంచనున్న పవన్‌

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తన గొంతును వినిపించేందుకు సిద్దం అవుతున్నాడు.తాజాగా ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

 Pawan Kalyan Meets Cm Chandrababu On Ap Capital Land-TeluguStop.com

ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ కూడా కేంద్రం తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.కొత్త రాష్ట్రం, కష్టాల్లో ఉన్న రాష్ట్రం అని కేంద్రానికి తెలిసినా కూడా ఏమాత్రం సాయం చేయకుండా మొండి చేయి చూపించడాన్ని పవన్‌ కళ్యాణ్‌ తప్పుబడుతున్నట్లుగా తెలుస్తోంది.

ఈ విషయమై తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన పవన్‌ కళ్యాణ్‌ త్వరలోనే ప్రధాని మోడీతో కూడా భేటీ అయ్యి, చర్చలు జరపాలని భావిస్తున్నాడు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని పక్షంలో తాను వారికి వ్యతిరేకంగా పోరాడుతాను అంటూ గతంలోనే పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించిన విషయం తెల్సిందే.

ఆ క్రమంలోనే త్వరలో ప్రధాని మోడీని కలిసి ఏపీకి ఇచ్చిన హామీల గురించి గుర్తు చేసి, వాటి అమలుకు ఒత్తిడి తేవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.మరి పవన్‌ ఒత్తిడికి కేంద్రం ఏమైనా సాయం చేసేనో చూడాలి.

ఇక రాజధాని బాధితులను పరామర్శించేందుకు ఈనెల 5వ తారీకున గుంటూరులో పవన్‌ పర్యటించనున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube