జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని అమిత్ షా కు వినతి పత్రం అందజేశారు.
ఈ భేటీలో పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షల మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అంత మాత్రమే గాక త్వరలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నిక విషయంలో బీజేపీ -జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని అమిత్ షాను పవన్ కళ్యాణ్ కోరడం జరిగిందట.బీజేపీ- జనసేన కూటమిగా ఏర్పడి ఏడాది అయిన తర్వాత అమిత్ షా తో పవన్ కళ్యాణ్ భేటీ అవ్వటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉంటే ఇదే విషయంపై ప్రధాని మోడీ తో భేటీ అవ్వాలని ప్రయత్నించిన ఈ క్రమంలో మోడీ అపాయింట్మెంట్ పవన్ కి దొరకలేదని టాక్.
.