పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డ విషయం ఆయన అభిమానులకు తీవ్ర ఆందోళన కలిగించింది.ఆయన వెంటనే కోలుకోవాలంటూ చాలా మంది చాలా రకాలుగా పూజలు చేశారు.
అభిమానుల పూజల ఫలితంగా ఆయన ఆరోగ్యం వెంటనే కుదట పడింది.ఇటీవల చేసిన టెస్టులో కరోనా నెగటివ్ గా వచ్చినట్లుగా తెలుస్తోంది.
అపోలో వైధ్యులు నిన్నటి వరకు పవన్ ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్స అందించడం జరిగింది.ఎట్టకేలకు ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో ఫామ్ హౌస్ నుండి వైధ్యులు వెళ్లి పోయారని తెలుస్తోంది.
పవన్ వ్యక్తిగత వైధ్యుడు మాత్రం అక్కడే ఉన్నారు.మరో వైపు ఆయన ఇంకా కాస్త నలతగా నీరసంగా ఉన్నట్లుగా వారు చెబుతున్నారు.
కరోనా వచ్చి వెళ్లిన వారు కనీసం వారం నుండి పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని అందుకే పవన్ కళ్యాణ్ కూడా పూర్తి విశ్రాంతిలో ఉన్నాడు.
మొన్నటి వరకు ఇతరులతో అస్సలు మాట్లాడని పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే పార్టీ వ్యవహారాలను చక్క బెట్టడంతో పాటు సినిమాల విషయంలో కూడా చర్చలు జరుపుతున్నారు.
పవన్ కోలుకున్న వెంటనే రానాతో కలిసి ఆయన చేస్తున్న మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ షూటింగ్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది.ఆ సినిమా షూటింగ్ ను జూన్ వరకు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
కనుక ఈ నెల చివరి నుండి పవన్ కళ్యాణ్ ఆ రీమేక్ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా నిర్మాత ఒకరు చెప్పుకొచ్చారు.పవన్ ఆ రీమేక్ పని పూర్తి చేసిన తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా ను చేస్తాడు.
అది సెట్స్ పై ఉండగానే హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా ను పట్టాలెక్కిస్తారని అంటున్నారు.మొత్తానికి పవన్ కళ్యాణ్ వచ్చే నెల ఆరంభం నుండి బిజీ అవ్వబోతున్నాడని ఆ నిర్మాత చెబుతున్నారు.