పవన్ కోసం ఆగస్టు వరకు ఎదురు చూడాల్సిందేనట

పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్‌ లు లైన్ లో ఉన్నాయి.అందులో మొదటిది అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ ను ఈ ఏడాది లో విడుదల చేయాలని భావించారు.

 Pawan Kalyan May Be Join August Shooting, Big News , Film News,  Harish Shankar-TeluguStop.com

కాని కరోనా సెకండ్‌ వేవ్‌ సినిమా చిత్రీకరణ నిలిపి వేసేలా చేసింది.ఇక తదుపరి షెడ్యూల్‌ ఎప్పుడు మొదలు పెడతారా అంటూ అంతా ఎదురు చూస్తున్నారు.

ఈ సమయంలోనే క్రిష్‌ దర్శకత్వం లో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా చిత్రీకరణ కూడా మద్యలో నిలిచి పోయింది.మరో వైపు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో సినిమా కూడా పట్టాలెక్కాల్సి ఉంది.

ఈ మూడు సినిమా లు కూడా కేవలం మూడు నాలుగు నెలల గ్యాప్‌ లో విడుదల చేయాలని మొదట ప్లాన్‌ చేశారు.కాని పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు అంటున్నారు.

సినిమాల షూటింగ్‌ లకు పవన్‌ జులై నుండి హాజరు అవ్వాలని భావించాడు.కాని పరిస్థితులు ఏమాత్రం సరిగా లేవు.

దాంతో మరో నెల రోజులు ఆలస్యం గా షూటింగ్ల కు హాజరు అవ్వాలని ఆయన భావిస్తున్నాడట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్‌ కళ్యాణ్ ఆగస్టులో సినిమా షూటింగ్‌ కు జాయిన్ అవ్వాలని మేకర్స్ భావిస్తున్నారు.

ప్రస్తుతం సినిమా షూటింగ్‌ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నా కూడా కరోనా నేపథ్యంలో ఆలస్యం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇక హరి హర వీరమల్లు సినిమా చిత్రీకరణ కోసం కూడా క్రిష్ ఏర్పాట్లు చేస్తున్నాడు.

ఈ మూడు సినిమా ల చిత్రీకరణ ఏక ధాటిగా కొనసాగించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.పవన్‌ కళ్యాణ్ మూడు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం మూడు సినిమాలు మూడు దశల్లో ఉన్నాయి.ఆ ముగ్గురు దర్శకులు కూడా ఆగస్టు వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube