అప్పుడు పవన్‌ భయపడ్డట్లే ఇప్పుడు జరుగుతుంది

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కోసం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో రైతుల నుండి భూములు తీసుకున్న విషయం తెల్సిందే.కొన్ని వేల మంది రైతులు రాజధాని కోసం భూములను త్యాగం చేశారు.

 Pawan Kalyan Mangalagiri Land Lease Amaravathi-TeluguStop.com

కొందరికి కన్నీరు మిగిలితే కొందరికి మాత్రం కోట్లు కురిశాయి.నష్టపోయిన వారి పరిస్థితి ప్రస్తుతం మరీ దారుణంగా ఉంది.

అమరావతి రాజధాని కాదంటూ సీఎం జగన్‌ చేసిన ప్రకటనతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.తమకు న్యాయం చేసేది ఎవరు.

తమ గోడు పట్టించుకునేది ఎవరు అంటూ గత వారం పది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.

ఈ సమయంలోనే పవన్‌ కళ్యాణ్‌ ఒక వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

ఆ వీడియో 2015 ఆగస్టు 23న తీసింది.అందులో పవన్‌ మాట్లాడుతూ మీరు ఇష్టానుసారంగా భూమిని సేకరిస్తున్నారు.

మీకు భూమి ఇచ్చే వారి భవిష్యత్తు వారి పిల్లల భవిష్యతు ఏంటీ అంటూ ప్రశ్నించాడు.ఒక వేళ వచ్చే ఎన్నికల తర్వాత తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాకుంటే పరిస్థితి ఏంటీ అంటూ అప్పుడే పవన్‌ ప్రశ్నించాడు.

ఇప్పుడు అదే పరిస్థితి అయ్యింది.పవన్‌ అన్నట్లుగానే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకపోవడంతో భూములు ఇచ్చిన రైతుల జీవితాలు నాశనం అయ్యే పరిస్థితికి వచ్చింది అంటూ జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube