జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ లాయర్ సాబ్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ జరుపుకుంటోంది.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఎ టువంటి వార్తలు బయటకు పొక్కకుండా చిత్ర యూనిట్ సభ్యులు చాలా జాగ్రత్తలు పడుతున్నారు.
అయితే తాజాగా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర విడుదల తేదీ ఖరారు గురించి ఒకానొక సందర్భంలో పవన్ అభిమానులతో పంచుకున్నాడు.
అంతేగాక మే 15వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయడం కోసం ఇప్పటికే పలు సలహాలు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నా డు.అయితే ఇప్పటికే ఈ చిత్రంలోని పలు కీలక సన్నివేశాలు షూటింగ్ పూర్తి చేసుకున్న టీలు తెలుస్తోంది.
అయితే ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం ప్రముఖ నూతన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో ఆడిపాడిన టువంటి ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.