పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టి తన ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే పింక్ రీమేక్ చిత్ర షూటింగ్ను ప్రారంభించిన పవన్, తాజాగా క్రిష్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు.
ఈ సినిమాను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.తమిళ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాను అఫీషియల్గా ప్రారంభించారు చిత్ర యూనిట్.ఈ సినిమాలో పవన్ రాబిన్హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా పవన్ సరసన హీరోయిన్ ఎవరనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా తీర్చిదిద్దేందుకు చిత్ర దర్శకుడు క్రిష్ రెడీ అవుతున్నాడు.
కాగా దీనిని భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా రిలీజ్ ఈ ఏడాదిలోనే ఉంటుందని పలువురు అంటున్నా, దీనిని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్.
ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు క్రిష్.మరి సంక్రాంతి బరిలో పవన్ సినిమా అంటే ఆ పండగకు నిజమైన సందడి తేవడం ఖాయమని అంటున్నారు పవన్ ఫ్యాన్స్.